కాల్వలో పడిన స్కూల్ బస్సు, విద్యార్థిని మృతి
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాక్సిల్ విరగడంతో బస్సు కాలువలోకి దూసుకు వెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని లహరి. ఆమె వయస్సు ఏడు. ఏడో తరగతి చదువుతోంది. ఈ బస్సు విజ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన బస్సు.

బస్సు దుగ్గిరాల మండలం శృంగారపురం నుండి విద్యార్థులను తీసుకు వస్తుండగా నూతక్కి - కొత్తపాలెం రహదారిలో ప్రమాదవశాత్తూ తాటిచెట్టు మొద్దును ఢీకొట్టింది. బస్సులోకి దూసుకు వచ్చిన తాటిమొద్దు తగిలి విద్యార్థిని లహరి అక్కడికి అక్కడే మృతి చెందింది. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications