డిగ్గీపై సీమాంధ్ర కాంగ్ అలక: వేరు దారిలో మరికొందరు

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం, భద్రాచలంను సీమాంధ్రలో కలపటం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న డిగ్గీని కలిసేందుకు కూడా వారు ఆసక్తి చూపడం లేదు. మెజార్టీ నేతలు డిగ్గీని గురువారం కలుసుకోలేదు.
సీమాంధ్రుల డిమాండ్లు అన్ని కాకపోయినా కొన్నింటిని పరిగణలోకి తీసుకున్నా తాము ప్రజల్లోకి వెళ్లి సర్ది చెప్పుకునే అవకాశం ఉండేదని కానీ, తమకు అధిష్టానం ఆ అవకాశం ఇవ్వలేదని వాపోతున్నారు. తాము ఇప్పటికే చెప్పేదంతా చెప్పామని, కొత్తగా డిగ్గీకి చెప్పేదేమీ లేదని, ఆయనను కలువబోమని శైలజానాథ్ చెప్పారు. అయితే ఆయన నుండి పిలుపు వస్తే మాత్రం వెళ్తామన్నారు.
మరోవైపు అధిష్టానానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న ప్రజాప్రతినిధులు మాత్రం దిగ్విజయ్ని కలిశారు. మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, డొక్కా మాణిక్యవర ప్రసాద్, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి తదితరులు కలిశారు.












Click it and Unblock the Notifications