జగన్కు అవైనా ఉన్నాయి కానీ: కిరణ్పై కొండ్రు హెచ్చరిక

ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ సీమాంధ్ర ప్రజలను మోసం చేయడం కళ్లారా చూశామని, కొంతమందిని ఉసిగొల్పి సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సినవి అడగనీయకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీడియాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, బొత్స సత్యనారాయణ, బాలరాజు, రఘువీరా రెడ్డిలతో పాటు తనను ఆయన మీడియా ద్వారా విమర్శిస్తున్నారు.
ఒక్క టి ఖర్చు కూడా లేకుండా సోనియా తనను సిఎంను చేసిందని ఎన్నోసార్లు చెప్పుకున్న కిరణ్ ఇప్పుడు కాంగ్రెస్నే దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను దుష్ప్రచారం చేస్తున్న ఛానల్ చైర్మన్ ఎవరో తెలుసని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అన్ని విషయాలు మా ట్లాడాల్సి వస్తుందన్నారు. కిరణ్తోనైనా, జగన్తోనైనా వారు కాంగ్రెస్లో ఉన్నంతవరకే క్లోజ్గా ఉన్నామని, కాంగ్రెస్ను వీడిన తర్వాత దూరమయ్యానన్నారు.
కిరణ్కు, జగన్కు పెద్ద తేడాలేదన్నారు. వ్యక్తిగతంగా తమ జోలికి రావొద్దని కిరణ్ను, ఆయన తమ్ముడిని హెచ్చరించారు. రాహుల్ను ప్రధానిని చేయడానికి తెలంగాణ ఇచ్చారని ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, పదేళ్లలో సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఎప్పుడు కావాలన్నా ప్రధాని అయ్యే అవకాశముందన్నారు. వందేళ్లు కాంగ్రెస్ ను రానీయకూడదని మాట్లాడుతున్న జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ఒక లక్ష ఇచ్చేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications