‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’: ఇది పవన్ పెట్టిన పేరు, 9న
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం సెప్టెంబర్ 9న కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' అని నామకరణం చేశారు.
ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత ఆదివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని జేఎన్టీయూ క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించనున్నారు.

ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాగా, కాకినాడ సభలో ప్రత్యేక హోదా విషయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. తన రాజకీయ ప్రణాళికలపై కూడా ఈ సభలో కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications