దీర్ఘకాల సెలవుల్లో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు: కారణాలేంటీ? కేంద్ర సర్వీసులకు వెళ్తా
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన ఘటనతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన పనితీరు వివాదాస్పదంగా ఉందని, చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన పనితీరుపై నిఘా ఉంచింది కేంద్ర ఎన్నికల కమిషన్.
వైఎస్ఆర్ సీపీ నేతలు చేసిన ఆరోపణలు నిజమని తేలడంతో బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకూడదని అప్పట్లో హెచ్చరించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురి చేసింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై న్యాయపోరాటం కూడా చేసి, ఎదురు దెబ్బలు తిన్నారు.
ఏపీ
ఎక్స్ప్రెస్
మరో
ట్రాజెడీని
మిగిలిస్తుందా?
ఢిల్లీ
దాకా
వెళ్లాలంటే
ప్రాణాలు
ఉగ్గబట్టుకోవాల్సి
అదలా వుంచితే- తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దీనికి ప్రధాన కారణం.. ఆయన దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడమే. ఈ నెల 1వ తేదీ నుంచి 28 వరకు సెలవులపై వెళ్లారు. దీనికోసం తన ఎర్న్డ్ లీవులను కూడా ఆయన వాడుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయనకు సెలవులను మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికలకు ముందు వరకూ ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి కీలక పదవిలో ఉండి, ఆ తరువాత తెర మరుగైన వెంకటేశ్వరరావు ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మొన్నటి ఐపీఎస్ అధికారుల బదిలీల సందర్భంగా కూడా ఏబీ వెంకటేశ్వరరావు పేరును పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో- ఆయన నెలరోజుల పాటు సెలవులపై వెళ్లారు. సెలవులను ముగించుకుని వచ్చిన తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తు ప్రాసెస్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర సర్వీసులకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన పీ సీతారామాంజనేయులు వంటి కొందరు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులు రాష్ట్ర సర్వీసులకు తిరిగి వచ్చారు. అదే క్రమంలో ఏబీ కూడా కేంద్రానికి వెళ్లొచ్చని తెలుస్తోంది.