గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య జరిగింది. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మహిళను గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.మృతులు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలానే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సైతం ఘటనపై రియాక్ట్ అయ్యారు. కూలీ పనులకోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం భాదాకరమన్నారు.

More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications