బాబు సర్కారుకు షాక్: సదావర్తి భూములపై సుప్రీం తీవ్ర హెచ్చరిక
ఏపీలో సంచలనంగా మారిన సదావర్తి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేహర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ.40కోట్లు తేడా ఉండటమేంటని ఆంధ్రప్రద
న్యూఢిల్లీ/అమరావతి: ఏపీలో సంచలనంగా మారిన సదావర్తి భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ.40కోట్లు తేడా ఉండటమేంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేగాక, తొలిసారి వేలం పారదర్శకంగా జరిగినట్లు కనిపించడం లేదని అన్నారు.
ట్రస్ట్ ఆస్తులు కాబట్టి తక్కువ ధరకు అమ్మితే కోర్టు కళ్లు మూసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో తమను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

ఆ భూములు సదావర్తి సత్రానివేనని స్పష్టంగా తెలుస్తోందని, అక్కడి జరిగిన ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత తమిళనాడు సర్కారుదేనని స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ.. భూములను వేలంలో దక్కించుకున్న సంస్థ, ఇప్పుడు డబ్బు కట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది.
కాగా, రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి డబ్బులు కట్టే విషయమై శనివారం మధ్యాహ్నం వరకూ గడువుందని గుర్తు చేసింది. నోటీసులు పంపించి తదుపరి ప్రక్రియ కొనసాగించేందుకు సమయం కోరింది. దీంతో కేసు విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ప్రకటించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications