విశాఖ విషాదం: ప్రమాద సమయం నుంచి హైకోర్టు వరకు మినిట్-టూ-మినిట్ అప్డేట్స్
ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం.ఇందులో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
లాక్ డౌన్ పీరియడ్లో ఈ పరిశ్రమ మూతపడింది. తాజా సడలింపుల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 4గంటలకు పరిశ్రమను తెరిచారు. ఇదే సమయంలో పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైంది. అది గాల్లో 3కి.మీ మేర వ్యాప్తి చెందడంతో స్థానికులపై తీవ్ర ప్రభావం పడింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఇక విశాఖ ఎల్జీ పాలిమార్స్ ప్రమాధ ఘటనపై మినిట్-టూ-మినిట్ అప్డేట్స్ మీకోసం
An ex-gratia of Rs 1 crore each to be given to the families of the deceased in the #VizagGasLeakage incident. Ex gratia of Rs 10 lakhs to be given to those on ventilator: Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy pic.twitter.com/KgtxGiPdbD
— ANI (@ANI) May 7, 2020
Just got information that the death toll has risen to 10: SN Pradhan, Director General of National Disaster Response Force (NDRF) #VizagGasLeak pic.twitter.com/wHUTYn1LmT
— ANI (@ANI) May 7, 2020