బౌన్స్ బ్యూటీ సెలూన్: లోపలంతా అదే?, మఫ్టీలో వెళ్లి బయటపెట్టిన పోలీసులు
గుంటూరు: పేరుకు అదో సెలూన్. కానీ క్షవర కార్యక్రమాల కంటే.. లోపల రహస్య కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతుంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఈ సెలూన్ పై చాలా ఫిర్యాదులు రావడంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. హెయిర్ కటింగ్ పేరుతో సెలూన్ లోపలికి వెళ్లి.. అక్కడ జరుగుతున్న వ్యభిచార కార్యక్రమాలను బట్టబయలు చేశారు.
బౌన్స్ బ్యూటీ సెలూన్:
గుంటూరులోని లక్ష్మీపురం రోడ్డులో బౌన్స్ బ్యూటీ అనే సెలూన్ ఉంది. ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు అందాయి.
దీంతో ఆ సెలూన్పై నిఘా పెట్టిన పోలీసులు.. శుక్రవారం సాయంత్రం స్వయంగా రంగంలోకి దిగారు. ఎస్ఐతో పాటు మస్తాన్, ప్రవీణ్, నాగరాజు, నాగేశ్వరరావు, నాగయ్య అనే కానిస్టేబుళ్లు, మరో మహిళా కానిస్టేబుల్ కలిసి సెలూన్ వద్దకు వెళ్లారు.
మఫ్టీలో వెళ్లిన పోలీసులు:
సెలూన్ వద్దకు పోలీసులంతా మఫ్టీలో వెళ్లారు. కొంతమంది కానిస్టేబుళ్లను బయటే ఉండి సెలూన్ లోకి వచ్చిపోయేవాళ్లను గమనిస్తున్నారు. మిగతావారు సాధారణ కస్టమర్స్ లాగా.. హెయిర్ కటింగ్ కోసం లోపలికి వెళ్లారు. కటింగ్, కాలి గోర్లు తీయడానికి కలిపి రూ.700లు ఖర్చవుతుందని చెప్పడంతో.. ఆ డబ్బు చెల్లించి లోపలికి వెళ్లారు.
మాటల కలిపాక తెలిసింది..:
హెయిర్ కట్ చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడివారితో మాటలు కలిపారు. ఇంకా ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. దీంతో మహిళలతో మసాజ్ అందుబాటులో ఉందని వారు చెప్పారు.
అదే సమయంలో సెలూన్ లోపల కొన్ని గదుల్లో రహస్యంగా ఏదో జరుగుతున్నట్టు గమనించారు. కొంతమంది లోపలికి వెళ్లడం బయటకు రావడం గమనిస్తూ అలాగే కూర్చున్నారు.
వ్యభిచారం జరుగుతోందని నిర్దారించుకున్నాక..:
సెలూన్ లోపలికి వచ్చి వెళ్తున్నవారు ప్రవర్తిస్తున్న తీరు.. అక్కడి గదుల్లో కనిపించిన కండోమ్స్ చూసి పోలీసులకు అనుమానాలు బలపడ్డాయి. దీంతో బయట ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో.. అంతా కలిసి సెలూన్పై దాడి చేశారు. వాడిపారేసిన కండోమ్స్ గుర్తించారు.
అదుపులో 8మంది..:
తనిఖీల్లో ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,500ల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లాకు చెందిన సుకన్య, గుంటూరు నగరాలకు చెందిన లక్ష్మి, మారుతీనగర్కు చెందిన మస్తాన్బీ, విజయవాడకు చెందిన సంధ్య, శాంతకుమారి, అమరావతి రోడ్డుకు చెందిన ప్రేమ్చంద్, పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన వెంకట సత్యాలరావు, గుంటూరు శ్యామలానగర్కు చెందిన వెంకట నరేష్లు ఉన్నట్టు సమాచారం.