షాక్: బాలుడిపై యువకులు గ్యాంగ్రేప్, వీడియో తీసి వాట్సప్లో..
కృష్ణా: జిల్లాలోని పెనమలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న ఒక బాలుడి(12)పై ఇద్దరు కామాంధులైన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని సెల్ఫోన్తో వీడియో తీసి, బాలుడిపై బెదరింపులకు దిగారు.
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడుకు చెందిన బాధిత బాలుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.
జూన్ 22న బాలుడు పాఠశాలకు వెళ్తుండగా రాధాకృష్ణ, దుర్గాప్రసాద్ అనే యువకులు అతడికి మాయమాటలు చెప్పి సైకిల్పై ఎక్కించుకొని పోరంకి నారాయణపురం కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడే అతనిపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు.
ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్లో పెడతామని బెదిరింపులకు గురిచేశారు. ఆ తర్వాత బాలుడితో జులై 3న ఒక సైకిల్ను చోరీ చేయించారు. అంతేగాక, ఆ ఇద్దరు అత్యాచారం వీడియోను బ్లూటూత్ ద్వారా పలువురికి పంపుతుండగా ఈ దారుణం గురించి బాలుడి కుటుంబసభ్యులకు తెలిసింది.
బాలుడిని వెంటబెట్టుకొని కుటుంబసభ్యులు బుధవారం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులు రాధాకృష్ణ, దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.