అమరావతి తప్ప చంద్రబాబుకు ఏదీ పట్టడం లేదు: శైలజానాథ్
హైదరాబాద్/ అనంతపురం: రాజధాని ప్రాంతం తుళ్లూరును తప్ప జిల్లాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేశామని తెలిపారు.
ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బిజెపి నీచ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 9వ తేదీన కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అన్ని గ్రామాల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామని చెప్పారు. ప్రత్యేకహోదా కోసం 29న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ అన్నారు.

ఇదిలావుంటే రాజకీయ అవసరాల కోసమే రాయలసీమ ఉద్యమాన్ని రాజకీయ నేతలు చేస్తున్నారని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.
మేధావులంతా కూర్చుని సమస్యలపై చర్చించుకోవాలన్నారు. రాయలసీమ కోసం చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. దోపిడీ ప్రభుత్వాలపై యువత పోరాటం చేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications