వీడియోలు చూసి ఆనందిస్తున్నారా?: 'షేమ్ ది రేపిస్ట్ కంపైన్' సునితా
హైదరాబాద్: తాను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన వీడియోను ఆరు నెలల క్రితమే చూశానని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, ఇలాంటి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అంటూ ప్రముఖ స్వచ్ఛంధ కార్యకర్త సునితా కృష్ణన్ శుక్రవారం ప్రశ్నించారు. అత్యాచార బాధితులకు అండగా నిలుస్తూ.. రేపిస్ట్ల ఫోటోలను సామాజిక అనుసంధాన వెబ్సైట్లో పెట్టిన సునితా కృష్ణన్ పైన ఈ రోజు హైదరాబాదులోని పాతబస్తీలో దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రేపిస్ట్స్ను ఎక్స్పోజ్ చేశానని, ఈ నేపథ్యంలో తన పైన దాడి జరిగిందని చెప్పారు. తాను నిందితుల ఫోటోలను సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఎవరైనా వారిని గుర్తిస్తే చెప్పాలని కోరానని తెలిపారు. తాను నిన్న సాయంత్రం సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఈ రోజు జాతీయ మీడియా ద్వారా తాను ప్రచారం చేశానని తెలిపారు.
అనంతరం తొమ్మిది గంటల తర్వాత తన పైన దాడికి యత్నం జరిగిందని చెప్పారు. తన కారును ధ్వంసం చేశారన్నారు. నిందితులు రేప్ చేయడమే కాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడటానికి వారికి ఎందుకు ఇంత ధైర్యం అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తాను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. బాధితులు తన వద్దకు ఇక ముందు కూడా వస్తారని, ఇలా చాలా వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించారు.

అయితే, ఇలాంటి దుర్మార్గాల పట్ల తాను ఒక్కదానినే రిపోర్ట్ చేస్తే సరిపోదన్నారు. అందరు కలిసి రావాలని కోరారు. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఆరు నెలల క్రితమే రేప్కు సంబంధించిన వీడియోను చూశానని చెప్పాడని, వాటిని చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. జరిగిన ఘోరాల పైన ఎవరికైనా ఫిర్యాదు చేసే ధైర్యం లేకుంటే తనను కలిసి చెప్పవచ్చునని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అత్యాచారానికి సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయని, ఒకటి ఉత్తర ప్రదేశ్ లేదా ఢిల్లీలో జరిగి ఉంటుందని చెప్పారు. ఈ రోజు తన పైన జరిగిన దాడి విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు బాగా స్పందించారని సునితా కృష్ణన్ పేర్కొన్నారు. యూట్యూబ్లో తాను నిందితుల గురించి పెట్టిన వీడియోలను తొలగించారని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఏదైనా సంఘటన జరిగితే ఎవరు కూడా ఫిర్యాదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేప్కు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా, నిందితులు సునితా కృష్ణన్ ఫేస్ బుక్, యూ్ట్యూబ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. తాను వీడియోల పైన పోరాటం ప్రారంభించానని చెప్పారు.
తన పైన దాడి జరిగిన అంశంపై ఆమె సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలోను స్పందించారు. ఎన్డీటీవీలో తాను 'షేమ్ ది రేపిస్ట్ కంపైన్' గురించి మాట్లాడిన అర్ధగంటలో అంటే ఉదయం తొమ్మిదిన్నరకు తన కారును ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications