కిరణ్ జైలుకెళ్లడం: శంకరన్న, పాశుపతం: దామోదర
హైదరాబాద్/ నల్లగొండ: విచాణర జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతితో అక్రమాస్తులు కూడబెట్టారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కిరణ్ ముఖ్యమంత్రి కాక ముందు అయిన తర్వాత ఉన్న ఆస్తులపై విచారణ జరపాలని సిబిఐకి లేఖ రాయనున్నట్లు మాజీ మంత్రి శంకర్రావు తెలిపారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినాటి నుంచి శంకరరావు ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద బ్రహ్మాస్త్రం ఉంటే దాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రజల పాశుపతాస్త్రం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నల్లగొండలో మాట్లాడారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా తెలంగాణ ఆగదని ఆయన అన్నారు.
కుట్రలూ కుతంత్రాలకు కిరణ్ కుమార్ రెడ్డి పర్యాయపదమని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications