దాడుల వెనుక సిఎం, కాపుల్ని దూరంచేస్తారా: శంకరన్న
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తుల పైన దాడుల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని మాజీ మంత్రి, కంటోన్మెంట్ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు శంకర రావు సోమవారం ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలను దూరం చేశారని, ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న కాపులను కూడా దూరం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తరు. కాంగ్రెసు పార్టీకి కాపులను దూరం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.
సంయమనం పాటించాలి: శ్రీధర్ బాబు
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపినందున ప్రజలు సంయమనం పాటించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వేరుగా అన్నారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారే తప్ప హడావుడిగా తీసుకున్నది కాదన్నారు. అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాతనే కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.