కేంద్ర మంత్రి ఏదో ఆశించారన్నాను, అంతే: వరప్రసాద్ రెడ్డి వివరణ
హైదరాబాద్: వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మందులు కొనుగోలు చేయాలని కోరితే అప్పటి కేంద్ర మంత్రి డబ్బు అడిగారంటూ తాను అన్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని శాంత బయోటెక్ చైర్మన్ వరప్రసాద్రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ‘కేంద్రమంత్రి మానుంచి ఏదో ఆశించారు, అది మా వల్ల వీలు పడలేదు' అని మాత్రమే అన్నానని, డబ్బు ప్రస్తావన తేలేదని స్పష్టం చేశారు. అలాగే 2007నుంచి 2011 వరకూ కేంద్రప్రభుత్వం చుట్టూ తిరిగి వేసారిపోయానని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు అవసరమైన వాక్సిన్ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకు అందించాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని మందులు కొనుగోలు చేయాలని అభ్యర్థిస్తే అందుకు ఓ కేంద్ర మంత్రి భారీ మొత్తాన్ని ఆశించారని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.

గురువారం తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగిన శాంతా బయోటెక్స్ ఇన్సులిన్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చ తివాచీ పరిచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుందని, ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తనీయకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వరప్రసాద్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
2007 సంవత్సరంలో ఓ వాక్సిన్ను ఉత్పత్తి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తక్కువ ధరకు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు సరఫరా చేయాలని కోరినట్లు స్పష్టం చేసారు. ఇందుకు ఓ కేంద్ర మంత్రి తమ సంస్థనుంచి ఏదో ఆశించారని, దాన్ని నెరవేర్చకపోవడం తమ వల్ల కాలేదని, దాంతో దేశ ప్రజలకు విలువైన వాక్సిన్ను అందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే వాక్సిన్ను పాకిస్తాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. 2007 నుంచి 2011 సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి వేసారిపోయినట్లు ఆరోపించారు. అనంతరం ఆ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకున్నామని, పారదర్శకంగా ఉంటామని ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications