వైఎస్ భారతికి షాక్.. ఆ వీడియోతో టీడీపీ సంచలన పోస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా, ప్రత్యర్థి పార్టీలు దానినే టార్గెట్ చేస్తున్నాయి. ఇక తాజాగా పులివెందుల నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ కోసం ఆయన సతీమణి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆమెను ఒక గ్రామస్తుడు నిలదీసిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ టార్గెట్ చేసింది.
వైఎస్ భారతి పై టీడీపీ పోస్ట్
ఇక టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో భారతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, స్థానికులు ఆమెను ప్రశ్నిస్తున్నారని, అడుగడుగునా భారతికి చేదు అనుభవం ఎదురు అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. ఈ క్రమంలో భారతిని ఒక స్థానికుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేకపోయారని కూడా పోస్ట్ చేసింది.

జగన్ సతీమణి భారతిని నిలదీసిన వైసీపీ నేత
ఇక ఇదే విషయాన్ని వెల్లడించిన టీడీపీ మా భూమిపై మీ భర్త ఫోటో ఏంటమ్మా! భారతీ.. అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వైసీపీనేత సుబ్బారెడ్డి వైఎస్ జగన్ సతీమణి భారతిని నిలదీశారని ఆ పోస్టులో పేర్కొంది. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీనేతే ఆస్తిపత్రాలపై జగన్ బొమ్మలు ఎందుకు అంటూ ప్రశ్నించేసరికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి భారతీరెడ్డి జారుకున్నారని పోస్ట్ చేసింది.
మా భూమిపై మీ భర్త ఫోటో ఏంటమ్మా! భారతీ.. అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వైకాపా నేత సుబ్బారెడ్డి నిలదీశారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతే ఆస్తిపత్రాలపై జగన్ బొమ్మలు ఎందుకు అంటూ ప్రశ్నించేసరికి సమాధానం చెప్పలేక అక్క… pic.twitter.com/H8V4IqAjO6
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2024
ఆ వీడియో పోస్ట్ చేసి భారతి టార్గెట్
టీడీపీ తన పోస్టులో భారతితో వైసీపీనేత సుబ్బారెడ్డి ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మలెందుకు అని ప్రశ్నిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా, ఒక పక్కా ప్లాన్ తో టీడీపీ టార్గెట్ చేస్తుంది. వైఎస్ భారతి పులివెందులలో జగన్ కోసం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతి ప్రచారానికి జనం నుండి కూడా మంచి స్పందన వస్తుంది.
సోషల్ మీడియాలో భారతి టార్గెట్
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారతి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆమెకు ప్రజల నుండి షాకింగ్ ప్రశ్నలు వస్తున్నాయని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. సోషల్ మీడియా వేదికగా భారతిని రచ్చ మొదలెట్టింది టీడీపీ.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications