సినిమా థియేటర్ లో.. లేడీస్ టాయ్లెట్లో.. ఏం జరిగిందంటే...
సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన ఓ మహిళ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేశాడ
విజయనగరం: సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన ఓ మహిళ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసిన ఉదంతమిది.
విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం 'ఉన్నది ఒక్కటే జిందగీ 'ఉదయం ఆటకు వెళ్లారు. సినిమా మధ్యలో చైతన్య భార్య లేడీస్ టాయిలెట్కు వెళ్లారు.
అప్పటికే అందులో శుభ్రం చేయడానికి ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. దీంతో ఆమె బయటకు పరుగు తీసి భర్తకు విషయాన్ని తెలిపింది. వెంటనే చైతన్య వచ్చి కార్మికుడిని నిలదీయగా తోటి కార్మికులు, సినిమా థియేటర్ సిబ్బంది చైతన్యపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో చైతన్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు.