ఎస్ఐ సిద్ధయ్య: పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోయాడు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడి కాల్పుల్లో గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య మరణం వారి కుటుంబంలో అంతులేని విషాదాన్నినింపింది. నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య నగరంలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన ధరణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శనివారం కాల్పుల్లో గాయపడిన సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి ఆయన భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చారు.

సిద్ధయ్య చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించారు. ఆ సమయంలో సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతున్నారు. తన బిడ్డను చూడకుండానే.. పెళ్లయిన ఏడాదికే సిద్ధయ్య మరణించడం.. అందర్నీ కలచివేసింది.
కాగా, సిద్ధయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సిద్ధయ్య చికిత్స పొందిన కామినేని ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్యకు మృతి విషయం తెలియడంతో తీవ్రంగా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. సిద్ధయ్య తల్లిదండ్రులు, అత్తామామలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications