రాజధాని: చంద్రబాబుకు సిఫి రూ. కోటి విరాళం(ఫొటో)
హైదరాబాద్: సిఫి బ్రాడ్ బ్యాండ్ సంస్థ సిఈఓ అనంత కోటిరాజు వేగేశ్న ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. కోటి విరాళంగా అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆయన తన సోదరుడు నరసింహరాజు తోపాటు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహాయం అందజేసిన వారిని చంద్రబాబు అభినందించారు. ఏపి రాజధాని నిర్మాణం కోసం పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజలు విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఏపి రాష్ట్ర పండుగగా టంగుటూరి జయంతి
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆగస్టు 28న ఆంధ్రకేసరి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.