ఓ సిఎంపై మరో సిఎం అధికారం చట్ట విరుద్ధమే: సిక్కిం మాజీ గవర్నర్
హైదరాబాద్/ న్యూఢిల్లీ : ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయించడం చట్టవిరుద్ధమేనని సిక్కిం మాజీ గవర్నర్ రామారావు వ్యాఖ్యానించారు. సెక్షన్-8 పై కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించిందో చూడాలని ఆయన కోరారు.
ఓటుకు-నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు. విభజన బిల్లు పెట్టినపుడే సెక్షన్-8పై చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి గవర్నర్ మాట్లాడాలని రామారావు సూచించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏనాడు సెక్షన్-8 గురించి మాట్లాడలేదని, వారిద్దరు సంక్షోభంలో ఉన్నారు కాబట్టే సెక్షన్-8 గుర్తుకువచ్చిందని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉభయ రాష్ట్రాల సమస్యలపై గవర్నర్, కేంద్రం సకాలంలో స్పందించలేదని విమర్శించారు. కేంద్రం కూడా రాజకీయ ప్రయోజనాలతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్లు చర్యలు తీసుకోకపోవడమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆయన అన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని నారాయణ తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications