ఫారం-7 ఎవరైనా ఇవ్వచ్చు : ఆ తరువాత ఒక్క ఓటు తొలిగించలేదు : సీఈవో ద్వివేదీ..!
ఏపిలో సాగుతున్న ఫారం-7 రచ్చకు ఏపి ఎన్నికల ప్రధానాధికారి ముగింపు పలికే ప్రయత్నం చేసారు. ఫారం-7 అనేది దరఖాస్తు మాత్రమే అని..దరఖాస్తు వస్తే ఓటు తొలిగించినట్లు కాదని తేల్చి చెప్పారు. రాజకీయ నేతలు ప్రజలను గంద రగోళ పరచటం సరి కాదన్నారు. జనవరి 11 తరువాత ఒక్క ఓటు కూడా తొలిగించలేదని స్పష్టం చేసారు.
ఫారం -7 దాఖలు తప్పు కాదు..
ఫారం -7 దాఖలు తప్పు కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేసారు. ద్వివేది మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఫారం-7 అనేది దరఖాస్తు మాత్రమేనన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. పోలీస్ కేసులు మొదలుకాగానే నకిలీ దరఖాస్తులు ఆగిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీల వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని హితవుపలికారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని వెల్లడించారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని వివరణ ఇచ్చారు.

ఆ తరువాత ఒక్క ఓటు తొలిగించలేదు..
జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్ప ష్టం చేశారు. ఫారం- 7 వస్తే దాని పై విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటి దాకా మొత్తం 10వేల ఓట్లు తొలిగించామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తంగా ఫారం -7 తమ వద్దకు 8.76 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో 161005 పారం-7 దరఖాస్తుల పరిశీలన చేసామన్నారు. అందులో, 5309 మాత్రమే అసలైనవి గా గుర్తించామని చెప్పుకొ చ్చారు. 155696 డూప్లి కేట్ గా గుర్తించామని ప్రకటించారు. దీని కోసం ప్రస్తుతం 45 వేల సిబ్బంది పని చేస్తున్నా రని.. నాలుగైదు రోజుల్లో ఈ దర ఖాస్తుల పరిశీలన పూర్తి అవుతుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications