సిట్ నివేదిక సిద్దం - లిస్టులో ముఖ్య నేతలు..!?
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ కీలక సమాచారం సేకరించింది.గొడవలు జరిగిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అన్ని కోణాల్లోనూ విచారించింది. బాధ్యులను గుర్తించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ప్రాధమిక నివేదికను ఈ రోజు ఉన్నతాధికారులకు ఇవ్వనుంది. ఈ నివేదికలో గొడవలకు కారణమైన కొందరు కీలక నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
సిట్ విచారణ
ఏపీలో ఎన్నికల హింస పైన సిట్ పూర్తి స్తాయిలో విచారణ చేస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా అసలేం జరిగిందో తెలుసుకున్నారు. తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది. పోలింగ్కు ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను ఆరా తీసింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులను వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేశారు. పల్నాడులో జరిగిన ఘటనల పైన అంబటి రాంబాబు సిట్ అధికారులకు వివరించారు.

సూత్రధారుల గుర్తింపు
సిట్ అధికారులు చంద్రగిరిలో జరిగిన ఘర్షణల పైన విచారించింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పీఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సిట్ అధికారులు తెలుసుకున్నారు. పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టపైన భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులను ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్ బృందం పర్యటించింది. మల్లమ్మ సెంటర్లో వాహనం తగలపెట్టిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
నేడు నివేదిక
తొలుత అల్లర్లు జరిగిన విచేపల్లి, మాచవరం మండలాల్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ నుంచి తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఇదే సమయంలో పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరి నుంచి సమాచారం సేకరించిన సిట్ ఈ రోజు డీజీపీ..సీఎస్ కు ప్రాధమిక నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయి..నివేదికలు ఏ అంశాలు ప్రస్తావించారనేది ఆసక్తిగా మారుతోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications