వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యం: స్నేక్ గ్యాంగ్ కేసులో సీఐ, ఎస్సైల సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పహాడీషరీఫ్ సీఐ భాస్కర రెడ్డిని, ఎస్సై వీరప్రసాద్‌లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో కొద్ది రోజుల క్రితం స్నేక్ గ్యాంగ్ దారుణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో వారిని సస్పెండ్ చేశారు.

Snake Gang: two Police officers suspended

కాగా, కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు స్నేక్ గ్యాంగ్‌కు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత వారిపై ఐదు కేసులో నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠాకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు.

స్నేక్ గ్యాంగ్ ఆగడాలకు నిలయంగా మారిన పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీలో దాగిన ఈ విషనాగుల కోసం సైబరాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కోసం పాతబస్తీ ప్రాంతాలైన పహాడిషరిఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదా చేశారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదా చేశారు.

English summary
Two Police officers suspended in Snake Gang case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X