అందుకే బతికున్నా: శోభ వర్ధంతిలో భూమా కంటతడి
హైదరాబాద్: దివంగత శోభా నాగిరెడ్డి తనకు భార్యగానే కాదని, మంచి స్నేహితురాలు కూడా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి శుక్రవారం అన్నారు. శోభా నాగిరెడ్డి మృతి చెంది ఏడాది అవుతోంది. ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా భూమా మాట్లాడారు.
శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుందని అనుకోలేదన్నారు. ప్రస్తుతం తాను తన పిల్లల కోసమే బతికి ఉన్నానని చెప్పారు. శోభా తన జీవితమంతా కష్టాలే అనుభవించిందన్నారు.

తమది చాలా పెద్ద కుటుంబమని, అయినప్పటికీ ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా శోభ నెంబర్ వన్గా ఉండాలని కోరుకునే వారన్నారు.
తనకు వైయస్ రాజశేఖర రెడ్డి తప్ప ఎవరు తెలియదని, ఆయన మృతి తర్వాత తాను జగన్ను కలిసి, ఆయన సీఎం కావాలని కోరుకున్నానని చెప్పారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి బలంగా కోరుకున్నారని చెప్పారు. ఆమె ఎప్పుడు ఇదే విషయం చెప్పేవారన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications