శోభ..షర్మిల కార్లో వెళ్తే, డ్రైవర్ అదృశ్యం: పవన్ సంతాపం

పవన్ సంతాపం
శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ సాట్ర్ పవన్ కళ్యాణ్ తన సంతాపం తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. శోభా మృతి నేపథ్యంలో చంద్రబాబు కర్నూలులో తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
డ్రైవర్ అదృశ్యం!
శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర. కారు ప్రమాదంలో అతను కూడా గాయపడ్డాడు. అతను నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండా పోయాడని తెలుస్తోంది. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడ్డ నాగేంద్రను మొదట ఆళ్లగడ్డలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.
బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. కడుపు, చాతినొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం తాను ఆరోగ్యంగా ఉన్నానని, మేడమ్ శోభా నాగిరెడ్డిని చూసి వస్తానని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడట. ప్రస్తుతం అతను కనిపించడం లేదంటున్నారు. నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు. మరోవైపు తాను అదృశ్యమయ్యాననే ప్రచారంపై డ్రైవర్ నాగేంద్ర స్పందించారు. తాను ఎక్కడకు వెళ్లలేదన్నారు. తాను సొంత గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నానన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం










Click it and Unblock the Notifications