'లోటస్పాండ్ నాది అని చెప్పలేక, ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర లేదు'
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తులపై విమర్శలు చేసిన సాక్షి దినపత్రిక, వైసిపి నేతల పైన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా నిప్పులు చెరిగారు.
విజయవాడ: తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తులపై విమర్శలు చేసిన సాక్షి దినపత్రిక, వైసిపి నేతల పైన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా నిప్పులు చెరిగారు.
అసలు జగన్కు అంత ఆస్తి ఎక్కడితో చెప్పాలని నిలదీశారు. లోటస్ పాండ్ ఇంటిని ఎన్నికల అఫిడవిట్లో చూపించే దమ్ములేని జగన్కు లోకేశ్ ఆస్తులపై మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
జగన్కు విలాస భవనాలు
దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని విలాసవంతమైన ఆస్తులు జగన్కు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తన వారసులకు ఆస్తులు కూడబెట్టారని, వారంతా ఎప్పటి నుంచో ఆదాయపన్ను కడుతున్నారన్నారు.
2004లో అమ్ముకునే స్థితి నుంచి..
2004లో ఇళ్లును కూడా అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. జగన్ నేర ప్రవృత్తి గల వ్యక్తి అన్నారు. లోకేశ్ నిజాయతీగా వ్యాపారం చేసుకునే వ్యక్తి అన్నారు.
లోకేష్ ఆస్తులపై పరిజ్ఞానం లేకుండా..
లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలపై కనీస పరిజ్ఞానం లేకుండా వైసిపి మాట్లాడుతోందన్నారు. జగన్కు దమ్ముంటే లోకేశ్ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు తప్పు చేయలేదు, భయపడరు
వైసిపిలో ఉన్న వారంతా ఏదో ఒక కేసులో ముద్దాయిలేనని, అదో ముద్దాయిల పార్టీ అన్నారు. చంద్రబాబు ఎన్నో కేసులు వేసినా ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని, అందుకే ఆయన భయపడే ప్రసక్తే లేదన్నారు.