సై అంటే సై: నిరూపిస్తా.. విరుచుకుపడ్డ కాకాని, రాజకీయాలు వదిలేస్తా.. సోమిరెడ్డి
టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నెల్లూరు: టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమిరెడ్డి అక్రమాస్తులను నిరూపించేందుకు తాను సిద్ధమని కాకాని చెప్పారు.
తన పైన కాకాని చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలాగే, తన పైన కాకాని చేసిన అవాస్తవ ప్రచారం పైన విచారణ జరిపించాలని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అంతకుముందు కాకాని మరోసారి సోమిరెడ్డిపై మండిపడ్డారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. విదేశాల్లో సోమిరెడ్డికి ఉన్న ఆస్తుల సంగతిని పక్కన పెట్టి, మొదట దేశంలో ఆయనకు ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలన్నారు.
విదేశీ
ఆస్తుల
చిట్టా,
ఆధారాలు:
కాకానికి
24
గం.ల
టైమిచ్చిన
సోమిరెడ్డి,
లేదంటే..
సోమిరెడ్డికి అక్రమాస్తులు ఉన్నాయని తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. సోమిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ఆధారాలంటూ మరికొన్ని పత్రాలను బుధవారం కాకాని మీడియాకు చూపించారు.
సోమిరెడ్డి కుమారుడికి మొత్తం తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులున్నాయని, ఓ పవర్ ప్రాజెక్టులో సోమిరెడ్డి డైరెక్టర్గా ఉన్నారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సోమిరెడ్డి నిరూపించలేకపోతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు.