వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ యుటి చేయాలంటాం: కెసిఆర్‌పై సోమిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Somireddy warns KCR on Polavaram
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బంద్‌కు పిలుపు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చూస్తే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలని డిమాండ్ చేస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

గ్రేటర్ హైదరాబాదులోని 24 శాసనసభా స్థానాల్లో తెరాస 3 స్థానాలు మాత్రమే గెలుచుకుందని, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తెరాసను తిరస్కరించారని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని స్థానికులు అంగీకరించలేదని కెసిఆర్ అనడంపై ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తెలంగాణలో పునరావాసం కల్పిస్తామని ఆయన చెప్పారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని ఆయన చెప్పారు.

కెసిఆర్‌కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని, తమ నాయకుడంటే ఈర్ష్యాద్వేషాలు ఎందుకని ఆయన అన్నారు. చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడి అవుతారని, జగన్ సీమాంధ్రలో సిఎం అవుతారని కెసిఆర్ అన్నారని, కెసిఆర్ మాట ఏమైందని ఆయన అన్నారు. తెలంగాణలో తెరాస బొటాబొటి మెజారిటీతో గెలిచిందని, దాంతో ప్రభుత్వం పడిపోతుందని కెసిఆర్ మజ్లీస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.

తలకాయ నరుక్కుంటా, దళిత నేతను సిఎం చేస్తానని కెసిఆర్ మాట తప్పారని ఆయన అన్నారు. పోలవరంపై రాద్ధాంతం చేయడం కెసిఆర్‌కు తగదని ఆయన అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు తమ పార్టీపై ఎందుకు విరుచుకుపడుతున్నారని ఆయన అడిగారు. ఆంధ్రులను శత్రువుల్లా చూస్తున్నారని, అందుకే హైదరాబాదులో తెరాస చిరునామా లేకుండా పోయిందని ఆయన అన్నారు. తాము సహనంతో వ్యవహరిస్తున్నామని, తెలంగాణ ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నామని, తెలంగాణలో తమ పార్టీ బలపడాలని అనుకుంటున్నామని సోమిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోకపోతే పరిణామాలు మరో విధంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

English summary

 Telugudesam Andhra Pradesh (seeamandhra) leader Somireddy Chandramohan Reddy has retaliated Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao comments on Polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X