మరోసారి మానవత్వం చాటుకున్న రియల్ హీరో సోనూసూద్
రియల్ హీరో సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తన సూద్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కారుకు నాలుగు అంబులెన్స్ లను అందించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూసూద్ అందించిన అంబులెన్స్లను ముఖ్యమంత్రి ప్రారంభించి.. వాహనాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. అందులో సోనూ సూద్ కూడా భాగస్వామ్యం కావడం పట్ల చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత సోనూసూద్ మీడియాతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందని సోనూసూద్ అన్నారు. తెలుగు ప్రజలు తనను మంచి నటుడిగా తయారు చేశారన్నారు. ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదని తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఏపీ తనకి రెండో ఇళ్లు లాంటిదని.. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళేనని చెప్పారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్నారు సోనూసూద్.

ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తన ఫౌండేషన్ తరుఫున అందించిన అంబులెన్సులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు, నిర్వహణ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. అందుకు తాను సిద్ధమేనని సోనూసూద్ తెలిపారు. అయితే గతంలో సోనూసూద్ జగన్ హయాంలో ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. ఈ వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోనూపై ట్రోల్స్ చేస్తున్నారు.
Thank you so much @ncbn sir, for your kind words. It was a pleasure meeting you too. I am glad our initiative resonates with you. I truly appreciate your support as we continue our efforts in uplifting communities through our organisation. @SoodFoundation 🇮🇳 https://t.co/aJ139dzyDQ pic.twitter.com/ydsUgJMj7A
— sonu sood (@SonuSood) February 4, 2025
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు సోనూసూద్. ఆ తర్వాత అనుష్క లేడి ఓరియంటెడ్ చిత్రం అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ లో జీవించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోగలిగారు. ఇక రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా సోనూసూద్ హీరోగా నటించిన ఫతేహ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించగా జాక్వెలిన్ హీరోయిన్ గా నటించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications