చల్లటి వార్త... ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై ఇవి విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ప్రస్తుతం రుతుపవనాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని, రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడతాయని పేర్కొంది.
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో ఏర్పడే వాతావరణాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని మరి కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఆదివారంనాడు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణవైపు గాలులు వీస్తున్నాయి.

ఆది, సోమవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా వడగాలలు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, కుమురం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారంనాడు, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీమ్, ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వెల్లడించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications