శ్రీవారిని సేవలో స్పీకర్ సుమిత్రా మహాజన్(ఫోటోలు)
తిరుపతి: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడుని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న సుమిత్రా మహాజన్కు తిరుమల తిరుపతి దేవస్దానం ఈవో సాంబశివరావు, అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఆమెకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్న తర్వాత రంగనాయకుల మండపంలో స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్లమెంటు, ది మీడియా లా కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ సుమిత్రా మాహాజన్ వచ్చారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీవారిని సేవలో స్పీకర్ సుమిత్రా మహాజన్
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడుని దర్శించుకున్నారు.
శ్రీవారిని సేవలో స్పీకర్ సుమిత్రా మహాజన్
ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న సుమిత్రా మహాజన్కు తిరుమల తిరుపతి దేవస్దానం ఈవో సాంబశివరావు, అధికారులు స్వాగతం పలికారు.
శ్రీవారిని సేవలో స్పీకర్ సుమిత్రా మహాజన్
అనంతరం ఆమెకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్న తర్వాత రంగనాయకుల మండపంలో స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని సేవలో స్పీకర్ సుమిత్రా మహాజన్
ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్లమెంటు, ది మీడియా లా కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ సుమిత్రా మాహాజన్ వచ్చారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.