జగన్కు ఈడీ కోర్టు ఝలక్- సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ విచారణ- గ్రీన్సిగ్నల్
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఇవాళ ఊరట దక్కలేదు. తనపై గతంలో సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో విచారణతో పాటే ఈడీ కేసుల విచారణ కూడా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్ధనను హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది.
వైసీపీ అధినేతగా ఉన్న జగన్పై 2010లోనే సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అయితే ఇందులో విచారణ నత్తనడకన సాగుతోంది. పదేళ్ల తర్వాత కూడా విచారణ పూర్తి కాలేదు. దీంతోపాటు మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది. ఈ రెండు కేసులను విడివిడిగా విచారించడం వల్ల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్కు హాజరు కావడం కష్టమని, సమయం కూడా వృథా అవుతుందని జగన్ తరఫు న్యాయవాదులు హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక కోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే సీబీఐ నమోదు చేసిన కేసులకూ, ఈడీ నమోదు చేసిన కేసులకూ సంబంధం లేదని, ఈ రెండు వ్యవహారాల్లో వేర్వేరు దర్యాప్తు, విచారణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. దీంతో సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ విచారణ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈడీ కేసులను ముందుగానే విచారణ జరుపుతామని ప్రకటించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను ఈ నెల 21కి వాయిదా వేసింది. దీంతో సీబీఐ కేసుల కంటే ముందే ఈడీ కోర్టులో కేసుల విచారణ సాగే అవకాశముంది.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications