బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనం
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక హోదా విషయమై సంచలన వ్యాఖ్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా అవసరం లేదని, కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని ఆయన చెప్పారు.
రాయలసీమ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణ దవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బైరెడ్డి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతందని అబద్దాలు చెబుతున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పడం గమనార్హం.

ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతాం: తోట నర్సింహం
ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలుగుదేశం పార్టీ లోకసభ పక్ష నేత తోట నర్సింహం ఢిల్లీలో అన్నారు. విభజన చట్టంలో లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాల్సి ఉందని చెప్పారు.
ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోడీ ఎన్డీయే సమావేశం నిర్వహించి మిత్రపక్షాలకు గౌరవం ఇచ్చారని, తరుచూ ఇలాంటి సమావేశాలు జరగాలన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications