కాంగ్రెస్ పోరు బాగుంది, కానీ ఒక్క మోడీపై ప్రేమ 5కోట్ల ఆంధ్రులపై లేదా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విషయంలో అధికార భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడిందని, కానీ ఐదు కోట్ల ఆంధ్రా ప్రజల కోసం ఎందుకు పోరాడటం లేదని ఎద్దేవా చేశారు.
I
love
Congress!
I
adore
Congress!
for
their
Zeal,
for
their
Fervour,
for
their
Passion
to
take
on
BJP
Govt...
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
13,
2015
..merely
for
'ONE
LALIT
MODI'Issue
than
to
fight
for
their
Promise
to
deliver
SPECIAL
STATUS
to
'FiFTY
MILLION
SEEMANDHRAS.' Hail
Congress!
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
13,
2015
ఒక్క లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు. బిజెపి ప్రభుత్వం పైన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు బాగానే ఉందని, కానీ ఏపీ ప్రత్యేక హోదా పైన ఎందుకు పోరాడటం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.