ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్, బాబు జాగ్రత్త: టెలికం సర్కిల్ ఏర్పాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక టెలికం సర్కిల్ ఏర్పాటు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి ఆస్కారం లేకుండా దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ ప్రత్యేక టెలికం సర్కిల్ ఏర్పాటు కానుంది. పదమూడు జిల్లాలను కలిపి దీనిని ఏర్పాటు చేస్తారు. ఏపీ టెలికం సర్కిల్ సీజీఎంగా దామోదర్ నియమితులయ్యారు.
ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపండి: కేంద్రానికి లేఖ
కాగా, గత ఏడాది ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డబ్బులతో సహా దొరికారు.
దీని పైన కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి సహా పలువురు టిడిపి నేతలు అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓటుకు నోటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను తెరపైకి తెచ్చింది.
ఓటుకు నోటు, జగన్కు షాకే: ఏడాదిలో తారుమారు, ఎవరికి లాభం?
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఏపీ ప్రభుత్వం, ఏపీ టిడిపి నేతలు భగ్గుమన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే వరకు తెలంగాణ - ఏపీ ప్రభుత్వాల గొడవ వెళ్లింది. ఇప్పుడు, తమ ఫోన్లను ట్యాపింగ్ చేయకుండా టెలికం సర్కిల్ ఏర్పాటు చేయడం గమనార్హం.