Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్, లోకేష్ లకు విద్యార్ధుల రిక్వస్ట్.. "మీకు దండం పెడతాం" అంటూ

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రాయపాలెం విద్యార్థుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. "డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం" అంటూ పసిమొగ్గలు చేస్తున్న విన్నపం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ప్రతిరోజూ చదువు కోసం 12 కిలోమీటర్ల మేర అడవి మార్గంలో, కొండలు ఎక్కుతూ దిగుతూ పాఠశాలకు వెళ్లాల్సి రావడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది.

ప్రాణాలతో పోరాడే ప్రయాణం..

విద్యార్థులు ప్రయాణించే మార్గం రాళ్లు, మట్టి, లోయలతో ప్రమాదకరంగా ఉండటమే కాకుండా వన్యప్రాణుల భయం కూడా వెంటాడుతోంది. వర్షాకాలంలో చిన్న వాగులు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లడం మరింత కష్టమవుతోంది. కొందరు చిన్నారులు జారిపడి గాయపడిన ఘటనలు కూడా గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో పిల్లలు బడికి వెళ్లే వరకు, తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనలోనే గడపాల్సి వస్తోంది.

students-from-rayapalem-at-vizianagaram-district-request-to-pawan-kalyan-and-lokesh

అత్యవసర పరిస్థితుల్లో డోలీలే దిక్కు..

రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు డోలీలలో మోసుకుంటూ కొండ దారులు దాటాల్సి వస్తోంది. వైద్య సేవలు ఆలస్యమవడం వల్ల ప్రాణాపాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణం కారణంగా కొంతమంది చిన్నారులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలు, బాలికలు ఈ కష్టాలను భరించలేక విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకోలేక హాజరు తగ్గిపోవడం కూడా మరో సమస్యగా మారింది.

పవన్, లోకేష్ లకు విద్యార్థుల వినతి..

గ్రామస్తులు పలుమార్లు అధికారులను కలిసినా స్పష్టమైన పరిష్కారం రాలేదని చెబుతున్నారు. అటవీ నిబంధనలు, అనుమతుల పేరుతో పనులు వాయిదా పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా పాలకులు మారినా తమ గ్రామ పరిస్థితి మాత్రం మారలేదని గిరిజనులు వాపోతున్నారు. తమకు పెద్ద సౌకర్యాలు అవసరం లేదని, కేవలం చదువుకోవడానికి ఒక రహదారి మంజూరు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని అటవీ క్లియరెన్స్ వంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అభివృద్ధి నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా తమలాంటి అడవి గ్రామాలకూ చేరాలని గిరిజనులు ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అయినా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 12 కిలోమీటర్ల కష్టమైన ప్రయాణానికి స్వస్తి పలికి, నాణ్యమైన రహదారి ఏర్పడితే పిల్లల భవిష్యత్తు మారుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+