Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం

Recommended Video

    Sujana Chowdary Argument with Arun Jaitley

    అమరావతి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గురువారం సాయంత్రం వాగ్వాదానికి దిగారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంపై ఆగ్రహంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ లాబీల్లోనే వాగ్వావాదినికి దిగారు. ఏపీ ప్రజలకు తాము ముఖం చూపుకొనే పరిస్థితి లేకుండా చేశారని జైట్లీపై సుజనా చౌదరి ప్రశ్నించారు.

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని టిడిపి ఎంపీలు భావించారు. కానీ, ఎంపీల ఆశకు నిరాశే మిగిలింది. పాత ప్రసంగాన్నే జైట్లీ వల్లే వేశారని టిడిపి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    నాలుగు రోజులుగా ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ, కేంద్రప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు లేవని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

    అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదం

    అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదం

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. లో‌క్‌సభలో జైట్లీ ప్రసంగం తర్వాత రాజ్యసభ లాబీల్లో జైట్లీతో సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. ఏపీకి న్యాయం చేయకపోవడంపై సుజనా చౌదరి జైట్లీకి మరోసారి వివరించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిన అంశాన్ని సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వద్ద ప్రస్తావించారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వావాదం చోటు చేసుకొంది.

    ఎందుకు సంతృప్తి చెందడం లేదు

    ఎందుకు సంతృప్తి చెందడం లేదు

    ఏపీకి ఇచ్చిన హమీల విషయమై తాము ఇప్పటికే ఏపీకి సాయంపై ప్రకటన చేసినప్పటికీ ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రశ్నించారని సమాచారం. అయితే ఏపీకి న్యాయం జరగలేదని సుజనా చౌదరి బదులిచ్చారు. ప్రజలను ఎంత కాలం మోసం చేయలేమంటూ సుజనా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

    రాజకీయపార్టీలకు విలువ ఇవ్వాలి

    రాజకీయపార్టీలకు విలువ ఇవ్వాలి


    ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన విషయమై కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నొక్కిచెప్పారు. ప్రభుత్వం శాశ్వతం కానీ... రాజకీయ పార్టీలు కాదని సుజనా చౌదరి గుర్తు చేశారు. పార్టీలకు విలువ ఇవ్వాలి కానీ... సభ్యులకు కాదని సుజనా చౌదరి కేంద్ర మంత్రి జైట్లీ వద్ద ప్రస్తావించారు.

    ప్రజలకు ముఖం ఎలా చూపాలి

    ప్రజలకు ముఖం ఎలా చూపాలి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేసే పరిస్థితి కన్పించడం లేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్ష పార్టీలకు చెందిన ఎంపీల నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ, బిజెపి నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ముఖం ఎలా చూపాలని టిడిపి ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+