హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇందూటెక్‌లో జగన్‌, సబితలకు సమన్లు: సాయి పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Summons to YS Jagan in Indu Tech case
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో సిబిఐ ఇటీవల దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది.

ఈ కేసులో నిందితులు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రత్నప్రభ, బిపి ఆచార్య, పార్థసారథి, కోటేశ్వర రావు, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్టు లిమిటెడ్, ఇందూ టెక్ జోన్ ప్రయివేట్ లిమిటెడ్, ఎస్పీఆర్ ప్రాపర్టీస్ ప్రయివేట్ లిమిటెడ్, భూమి రియల్ ఎస్టేట్స్‌లకు, నిమ్మగడ్డకు చెందిన జి2, జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియాలకు కూడా సమన్లు జారీ అయ్యాయి. నవంబర్ 13న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

బెయిల్ షరతులు సడలించాలని సాయి రెడ్డి

బెయిల్ షరతులను సడలించాలని జగన్ ఆసతుల కేసులో నిందితుడు విజయ సాయి రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్‌నని, విధి నిర్వహణలో భాగంగా ఇతర నగరాలకు వెళ్లడానికి వీలుగా షరతులను సడలించాలని కోరారు.

English summary
Principal special judge U Durga Prasad Rao of the CBI court on Thursday issued summons to YSR Congress chief YS Jaganmohan Reddy, former home minister Sabita Indra Reddy and other accused in the Indu Tech Zone epiosde of Jagan assets case, directing them to appear before the court on November 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X