విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చాలా కారణాలున్నాయ్
టాప్ సెర్చింజిన్ గూగుల్.. విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టింది. 15 బిలియన్ డాలర్లతో డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ను నెలకొల్పనుంది. గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ఇది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తోన్ మొట్టమొదటి AI కేంద్రం ఇదే. దీనికి సంబంధించి ఒప్పందాలు సైతం కుదిరాయి. ఈ డేటా సెంటర్ వల్ల వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డ్రీమ్ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్ లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్ మెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అభివర్ణించారు.

2026 నుండి 2030 మధ్యకాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్-ఆప్టిక్ నెట్వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు. అమెరికా వెలుపల తాము చేపట్టిన అతిపెద్ద AI ఇన్వెస్ట్ మెంట్ ఇదేనని పేర్కొన్నారు. దీనికి 80 శాతం విద్యుత్ ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్- సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని అని పిచాయ్ చెప్పారు.
ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక, వాతావరణపరంగా అనుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటోన్న గూగుల్ ఇప్పుడక్కడ భారీ పెట్టుబడులు పెడుతోండటం సంతోషంగా ఉందని అన్నారు.
Directly from the mouth of #Google CEO @sundarpichai
— Telugu Desam Party (@JaiTDP) October 18, 2025
* Beautiful coastal town #Vizag, growing up
* Largest ever Google investment outside the US
* Billion Investment
* 1 GW Data Center
* 80% Powered by Clean Energy
* Subsea cables coming in
This investment is set to… pic.twitter.com/v3WREEAQ9P
ఈ పెట్టుబడి వల్ల ఆ ప్రాంతాన్ని పూర్తిగా మారిపోతుందని సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరింత వేగంగా పురోగమించగలవని తెలిపారు. గూగుల్ ఇంటర్నల్ చాట్బాట్తో సహా AI ప్రొడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని అన్నారు.
గూగుల్ కంటే ముందుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన OpenAIని సుందర్ పిచాయ్ అభినందించారు. తాము అనుకున్నదాని కంటే ముందుగా దీన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. గూగుల్ ఇప్పటికే ఏఐ రీసెర్చ్, చిప్ డిజైన్ అండ్ ప్రొడక్ట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని, విశాఖ కూడా దీనికి కిందికే వస్తుందని అన్నారు. ChatGPT ప్రారంభించిన వెంటనే చాట్బోట్ను విడుదల చేయకూడదని మొదట్లో నిర్ణయించుకున్నామని, పోటీ ఉన్నందున జెమిని ఏఐని ప్రారంభించామని వివరించారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications