ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్గా జేకే మహేశ్వరి సిఫారసు
ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రిం కోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. ప్రస్థుతం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. కాగా ఆయన గతంలో సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయవాదిగా కూడ పనిచేశారు. అనంతరం 2005లో ఏంపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామితులయ్యారు.

అయితే గతంలో కూడ సుప్రిం కోర్టు జస్టిస్ విక్రంనాథ్ పేరును సైతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రిం కోర్టు సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును తిరిగి వెనక్కి పంపింది. దీంతో మరోసారి జస్టిస్ మహేశ్వరీ పేరును సిఫారసు చేసింది. కాగా రాజ్యాంగపరమైన పలు కేసుల్లో వాదించిన అనుభవం కూడ ఉంది.












Click it and Unblock the Notifications