ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించేందుకు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. దీంతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ సీట్ల వ్యవహారంపై విచారణ చేపడతామని పేర్కొంది. నవంబర్ 16, 17 తేదీల్లో విచారణ జరుపుతామని జస్టిస్ కిషన్ కౌల్ ధర్మాసనం తెలిపింది. మరోవైపు, తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కాగా, సెప్టెంబర్ నెలలో ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలైంది. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఎన్నికల సంఘంను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్ కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది సుప్రీంకోర్టు జస్టిస్ జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications