లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!!
లడ్డూ కల్తీ వ్యవహారం సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా వివాదం పైన దాఖలైన పిటీషన్ పై సుప్రీం సీజే ధర్మాసనం విచారణ చేసింది. లడ్డూ కల్తీలో యానిమల్ ఫ్యాట్ .. రసాయనాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని పిటీషనర్ సుప్రీం కు నివేదించారు. దీని పైన స్పందించిన సుప్రీం కోర్టు జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణ జరుగుతోంసీబీఐ దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం.దని.. ఏవైనా ఆధారాలు ఉంటే సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.
లడ్డూ వివాదం మరో సుప్రీంకు చేరింది. లడ్డూ వివాదంలో భాగంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని.. రసాయనాలతో లడ్డూ చేసారని జరుగుతున్న ప్రచారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ విచారణ సమయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పటానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది. ఈ కేసులో ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకు ఇవ్వాలని సూచించింది. ఈ వ్యవహారంలో ఇలాంటి పిటీషన్లను అనుమతించే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అటు ఏపీ ప్రభుత్వం సైతం ఏకసభ్య కమిషన్ నియమించటంతో ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది.

ఏపీలో ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. అధికార - విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఎవరి వాదనలు వారు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం రిటైర్డ ఐఏఎస్ దినేశ్ కుమార్ తో నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణలో భాగంగా టీటీడీ అధికారుల నుంచి కావాల్సిన సమాచారం ఆరా తీస్తోంది.
అయితే.. ఇప్పుడు ఈ వివాదం కారణంగా ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడుతాయంటూ తాజాగా సుప్రీంలో దాఖలైన పిటీషన్ లో పిటీషనర్ పేర్కొన్నారు. అందులోని అంశాలను ప్రస్తావించిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో.. అటు సీబీఐ తుది నివేదిక... ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చే అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications