సర్వే సమాప్తం: మూటముళ్లెతో నగరబాట (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ముగియడంతో తమ తమ స్వస్థలాలకు వెళ్లిన నగరంలో నివాసముంటున్న ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సర్వే పుణ్యమాని ప్రజలు తమ తమ ఇళ్లకు ఒకేసారి వెళ్లారు. దీంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. కాగా, సర్వే రోజున హైదరాబాద్ మాత్రం నిర్మానుష్యంగా మారింది. నగరవాసులు కూడా సర్వే ఉండటంతో మంగళవారం రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయాయి.
మంగళవారం నిర్మానుష్యంగా కనిపించిన మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు నగర శివార్లలోని బస్టాపులు తిరుగు ముఖం పట్టిన జనంతో కిటకిటలాడాయి. మూటాముల్లెలతో కుటుంబాలకు కుటుంబాలు నగరానికి చేరుకోవడంతో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్కు జనకళ వచ్చేసింది. గిరాకి, జనం లేక ఆగిన ఆటోలు మళ్లీ దారిన పడ్డాయి. గ్రామాల నుంచి వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో పోటీ పడ్డాయి. ఎంఎంటిసి రైళ్లూ కిటకిటలాడాయి.
సర్వేకు ప్రజలంతా గ్రామాలకు వెళ్లడంతో ఖాళీ అయిన కొన్ని బస్తీలు మళ్లీ నిండుగా కనిపించాయి. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నా.. అద్దె ఇళ్ల తాళాలు తెరచుకున్నాయి. ప్రతి రోజు తెలంగాణ జిల్లాలకు 2,900 బస్సులు నడుస్తాయని ఎంజిబిఎస్ ఏటిఎం సత్యనారాయణ చెప్పారు. వీటికి అదనంగా ఆగస్టు 17న 1,046 బస్సులు నడపగా, 18న 1,322 బస్సులు అదనంగా వేశామని ఆయన తెలిపారు.

నగర బాట
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ముగియడంతో తమ తమ స్వస్థలాలకు వెళ్లిన నగరంలో నివాసముంటున్న ప్రజలు తిరిగి నగరబాట పట్టారు.

నగర బాట
సర్వే పుణ్యమాని ప్రజలు తమ తమ ఇళ్లకు ఒకేసారి వెళ్లారు. దీంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది.

నగర బాట
సర్వే రోజున హైదరాబాద్ మాత్రం నిర్మానుష్యంగా మారింది. నగరవాసులు కూడా సర్వే ఉండటంతో మంగళవారం రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయాయి.

నగర బాట
మంగళవారం నిర్మానుష్యంగా కనిపించిన మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు నగర శివార్లలోని బస్టాపులు తిరుగు ముఖం పట్టిన జనంతో కిటకిటలాడాయి.

నగర బాట
మూటాముల్లెలతో కుటుంబాలకు కుటుంబాలు నగరానికి చేరుకోవడంతో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్కు జనకళ వచ్చేసింది.

నగర బాట
బస్టాండుల వద్ద తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు లోకల్ బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు.

నగర బాట
సర్వేకు ప్రజలంతా గ్రామాలకు వెళ్లడంతో ఖాళీ అయిన కొన్ని బస్తీలు మళ్లీ నిండుగా కనిపించాయి.

నగర బాట
గిరాకి, జనం లేక ఆగిన ఆటోలు మళ్లీ దారిన పడ్డాయి. గ్రామాల నుంచి వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో పోటీ పడ్డాయి.

నగర బాట
ఇంకా కొంతమంది నగరానికి రావాల్సి ఉన్నా.. అద్దె ఇళ్ల తాళాలు తెరచుకున్నాయి.

నగర బాట
ప్రతి రోజు తెలంగాణ జిల్లాలకు 2,900 బస్సులు నడుస్తాయని ఎంజిబిఎస్ ఏటిఎం సత్యనారాయణ చెప్పారు.

నగర బాట
వీటికి అదనంగా ఆగస్టు 17న 1,046 బస్సులు నడపగా, 18న 1,322 బస్సులు అదనంగా వేశామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications