రఘురామ అనర్హత వేటుపై సస్పెన్స్- నేటితో ముగిస్తున్న గడువు-ఏం జరగబోతోంది ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోసం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు ఇవాళ్టితో ముగియబోతోంది. దీంతో రఘురామరాజు వివరణ ఇస్తారా ? ఇస్తే అందులో ఏం చెప్పబోతున్నారు ? మరింత గడువు కోరే అవకాశముందా ? అదే జరిగితే పార్లెమంటులో ఒత్తిడి పెంచుతామన్న వైసీపీ తమ నిర్ణయాన్ని అమల్లో పెడుతుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంది.

రఘురామ డెడ్ లైన్ ముగింపు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో లోక్ సభ స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు విధించిన 15 రోజుల గడువు నేటితో పూర్తి కాబోతోంది. ఈ నెల 15న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నోటీసులు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వివరణ ఆధారంగానే ఆయనపై వైసీపీ కోరుతున్న విధంగా అనర్హత వేటు వేయాలా వద్దా అన్న విషయంపై లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు ఇచ్చే వివరణ ఉత్కంఠ రేపుతోంది.

జోరు పెంచిన రఘురామ
అనర్హత వేటుపై లోక్ సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు జోరు పెంచారు. వైసీపీపై దాడిని ఆయన కొన్నిరోజులుగా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా జగన్, విజయసాయిరెడ్డి, సజ్జలను టార్గెట్ చేస్తూ రఘురామరాజు చేస్తున్న దాడి పతాకస్దాయికి చేరింది. తనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇచ్చిన నోటీసులకు ప్రతిగా వీరిని టార్గెట్ చేస్తున్న రఘురామ... వారిపై ఉన్న కేసులతో పాటు మిగతా అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా పోతోంది.

మరింత గడువు కోరతారా ?
లోక్ సభ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చే విషయంలో రఘురామకృష్ణంరాజు పూర్తి క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తనపై అనర్హత వేటుకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో అంశాలకు కౌంటర్లు సిద్దం చేసుకున్న రఘురామ వాటిని ఇవాళ లోక్ సభ స్పీకర్ కు పంపే అవకాశముంది. అలా కుదరని పక్షంలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు ఏవైనా సంభవిస్తే నోటీసులపై వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ను మరింత గడువు కోరే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే స్పీకర్ నిర్ణయం కూడా కీలకంగా మారనుంది.

అన్నింటికీ సిద్ధంగా వైసీపీ
రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై వివరణ ఇస్తే తమ తరఫున కూడా వివరణ ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారం తేల్చేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అలా కుదరని పక్షంలో రఘురామరాజు మరింత గడువు కోరితే మాత్రం పార్లమెంటులో నిరసనలు చేపట్టడం ద్వారా స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు కూడా వైసీపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై సంకేతాలు ఇచ్చేశారు. రఘురామపై ఈ సమావేశాల్లోనే ఎలాగైనా వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ... ఆగస్టు 23న పార్లమెంటు ముగిసేలోపు వేటుకు పట్టుబట్టే అవకాశాలున్నాయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications