AP Schemes: ఏపీలో ఆ 14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల ఎప్పుడు ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున చర్చకు కారణమైన రూ.14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల పోలింగ్ ముగియగానే మూలనపడిపోయింది. విద్యాదీవెన, రైతు భరోసాతో పాటు పలు పథకాల లబ్దిదారులకు ఇవ్వాల్సిన రూ.14 వేల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానాలో ఉన్నప్పటికీ అవి విడుదలకు నోచు కోవడం లేదు. ఎన్నికల పోలింగ్ కు ముందు వాటి విడుదల కోసం కోర్టుల వరకూ వెళ్లిన ప్రభుత్వం.. ఇప్పుడు పోలింగ్ ముగిసినా వాటిని విడుదల చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అంటే ఈ ఏడాది జనవరిలోనే ఈ రూ.14 వేల కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం జగన్ సర్కార్ బటన్లు నొక్కేసింది. అయితే నిధులు మాత్రం మే నెల వరకూ జమ చేయలేదు. వీటిని సరిగ్గా ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజుల ముందు విడుదలకు సిద్దమైంది. ముందే బటన్లు నొక్కిన నిధులు కాబట్టి విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించింది. కానీ అక్కడే విపక్షాలు అడ్డుకున్నాయి. ఈసీకి ఫిర్యాదులు చేశాయి.

దీంతో రూ.14 కోట్ల సంక్షేమ పథకాల నిధుల విడుదలకు పోలింగ్ కు ముందు తొందరేం వచ్చిందని ఈసీ ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. దీంతో హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. ఎన్నికల పోలింగ్ తర్వాత రోజు అంటే 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని ఈసీ, హైకోర్టు తేల్చిచెప్పేశాయి. దీంతో 14వ తేదీన నిధులు లబ్దిదారుల ఖాతాల్లో పడతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇవాళ 16వ తేదీ వచ్చేసినా నిధులు మాత్రం విడుదల కాలేదు.
మరోవైపు ఖజానాలో ఉన్న ఈ నిధుల్లో నుంచి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిన్న ఐదు బిల్లుల్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటూ విపక్షాలు గవర్నర్ ను ఆశ్రయించాయి. దీంతో స్పందించిన గవర్నర్ ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్లుల క్లియరెన్స్ కు అడ్డుకట్ట పడినట్లు భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల నిధుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications