టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తా: చంద్రబాబుపై స్వరూపానంద ఆగ్రహం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది వారిని టిటిడి ఈవోగా నియమించడాన్ని తప్పుబట్టారు.
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది వారిని టిటిడి ఈవోగా నియమించడాన్ని తప్పుబట్టారు.
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని నియమించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాజీ ఈఓ సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఈ సంఘటనే నిదర్శనమన్నారు. మాజీ ఈవో నిజాయితీపరుడు అన్నారు.

తెలుగు చదవడం, మాట్లాడటం రాని వారిని ఈఓగా ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ఈఓ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయన్నారు.
ఉత్తర ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందన్నారు. టీటీడీకి ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై కోర్టుకు వెళతామని, ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులో ఉన్నారని అభిప్రాయపడ్డారు. చైర్మన్ పదవి రాజకీయాలకు అతీతమైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications