సాయిబాబా దేవుడెలా అయ్యారు?: స్వరూపానంద ప్రశ్నలు, నిరసనలు
ప్రకాశం: షిర్డీ సాయిబాబా దేవుడా? కాదా? అనే అంశంపై మరోసారి చర్చకు దారితీసేలా చేశారు ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహరాజ్. అంతేగాక, సాయిబాబా దేవుడెలా అవుతారని మహరాజ్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన ఆధ్యాత్మిక సభలో ఆయన మాట్లాడారు.
ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు లేకుండా బాబాను దేవుడిగా ఎలా పూజిస్తారని ప్రశ్నించారు. సాయి చిత్రపటాలను చూపిస్తూ ఆయన విమర్శలు చేశారు. సాయికృష్ణ, సాయిరామ్ అంటూ హిందూ దేవుళ్లతో కలిపి ఎలా ఆరాధిస్తారు?, సాయి మందిరాలలో హిందూ దేవతలను ఎలా ప్రతిష్ఠిస్తారని అన్నారు.

సాయిచాలీసా, సాయిగీత అంటూ ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. రామజన్మభూమి, తలాక్ అంశాలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. విమర్శలు చేశారు. అంతేగాక,'మదరసా, మిషనరీ పాఠశాలల్లో ఖురాన్, బైబిల్ బోధిస్తున్నారు.. ఏ విద్యాసంస్థలో హిందూ ధర్మాన్ని నేర్పుతున్నారు'ని ఆయన నిలదీశారు.
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వరూపానంద అన్నారు. ఇది ఇలా ఉండగా, ద్వారకా పీఠాధిపతి ప్రసంగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న సాయిబాబా భక్తులు నిరసన వ్యక్తం చేశారు. జై సాయిరామ్ అంటూ పీఠాధిపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుర్చీలను చిందరవందర చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని బయటకు పంపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications