త్వరగా స్పందించారు: చంద్రబాబుకు తమిళ మీడియా ప్రశంసలు
చెన్నై/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తమిళ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై తమిళ పత్రికలు జూనియర్ వికటన్, నక్కీరన్ పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.
హుధుద్ తుఫాను సమయంలో బస్సులో బసచేసి సహాయ చర్యలు చేపట్టారని జూనియర్ వికటన్ పేర్కొంది. కాగా, ప్రజలకు అండగా నిలిచి.. అధికారులను హెచ్చరించిన సీఎం పేరుతో నక్కీరన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. నడుంలోతు నీళ్లలో దిగి సహాయ చర్యలు పర్యవేక్షించారని చంద్రబాబును ఆ పత్రికలు కొనియాడాయి.

ఇటీవల భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళ పత్రికలు చంద్రబాబును ప్రశంసిస్తూ కథనాలు రాయడం గమనార్హం. కాగా, తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రూ. 10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసందే.
ఐటి సంస్థల ఆర్థిక సాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలమైన నేపథ్యంలో ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు తమిళనాడుకి ఆర్థిక సహాయాన్ని అందించాయి.
ఇన్ఫోసిస్ రూ.10కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించగా, కాగ్నిజెంట్ రూ.6.50కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రానికి ఆర్థిక సహాయంగా సీఎం సహాయనిధికి రూ.130కోట్లు వచ్చి చేరినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications