కాంగ్రెస్తో పొత్తంటే తెగతెంపులే: తమ్మినేని, కారుకు ఓకె
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే తెగతెంపులే ఉంటాయని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మంగళవారం ఏర్పాటు చేసిన మీత్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వెళ్ళేందుకు తాము సిద్ధమని, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామంటే మాత్రం తెగతెంపులే ఉంటాయని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను వ్యతిరేకించే శక్తులతో కలిసి పని చేయాలనీ, లేని పక్షంలో ఒంటరిగానే సాగాలన్న తమ జాతీయ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు.

కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్రం ముందు చాలా సమస్యలున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుపరిపాలనపై ఆశతో ఉన్నారని చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరు ప్రాంతాల సామరస్యం, పరస్పర సహకార ఆధారంగానే తెలంగాణ ముందుకు సాగే అవకాశం ఉందనని తమ్మినేని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని సిపిఐని కోరామని, అదేవిధంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వీరభద్రం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 17 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ దిగనున్నట్లు ఆయన చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications