వంగవీటి రాధాకు టీడీపీ తాజా ఆఫర్ - ఆ నియోజకవర్గాల్లో సీనియర్ల దారెటు..!?
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయం లాంఛనమే. దీంతో..రెండు పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లొ పోటీ చేసే ఆశావాహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఏ సీటు పాత్తులో భాగంగా ఏ పార్టీకి వెళ్తుందనే అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో టీడీపీ నుంచి జనసేనకు వెళ్లే అవకాశం ఉన్న నేతలను తమ పార్టీలోనే కొనసాగేలా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. జనసేనలోకి వెళ్లినా..రెండు పార్టీల పొత్తు ఖాయం కావటంతో సీట్లు దక్కుతాయా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అదే సమయంలో జనసేన నుంచి పోటీదారుల తోనూ టెన్షన్ తప్పటం లేదు. ఇందులో భాగంగా టీడీపీ కొన్ని కీలక స్థానాలకు సీట్లను అనధికారికంగా ఖరారు చేస్తోంది. తమ పార్టీ నుంచే పోటీ చేసేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది.
వంగవీటి రాధాకు టీడీపీ నేతల ఆఫర్..
2019
ఎన్నికల
వేళ
వంగవీటి
రాధా
టీడీపీలో
చేరారు.
గత
ఎన్నికల్లో
టీడీపీకి
మద్దతుగా
ప్రచారం
చేసారు.
ఎన్నికల్లో
పోటీ
చేయలేదు.
టీడీపీ
అధికారంలోకి
వస్తే
ఎమ్మెల్సీ
ఇస్తారనే
ప్రచారం
సాగింది.
అమరావతి
ఉద్యమానికి
రాధా
మద్దతు
ప్రకటించారు.
జనసేన
కొంత
కాలంగా
ఏపీ
రాజకీయాల్లో
యాక్టివ్
అవుతున్న
సమయంలో
వంగవీటి
రాధా
జనసేనలోకి
వెళ్తారంటూ
ప్రచారం
సాగింది.
జనసేన
ముఖ్య
నేత
నాదెండ్ల
మనోహర్
విజయవాడలో
వంగవీటితో
భేటీ
అయ్యారు.
కానీ,
ఇప్పుడు
టీడీపీ
-
జనసేన
పొత్తు
ఖాయం
కావటంతో
టీడీపీ
నుంచే
రాధా
పోటీ
చేసే
విధంగా
ముఖ్య
నేతలు
మంతనాలు
సాగిస్తున్నట్లు
విశ్వసనీయ
సమాచారం.
రాధా
2019
ఎన్నికల్లో
విజయవాడ
సెంట్రల్
కేటాయించని
కారణంగానే
పార్టీ
వీడారు.
ఇప్పుడు
అదే
సీటు
టీడీపీ
నుంచి
ఇచ్చేందుకు
ముందుకు
వచ్చినట్లు
తెలుస్తోంది.
బోండా ఉమా ఏం చేయబోతున్నారు...
పశ్చిమంలోనూ సీటు పంచాయితీ...
విజయవాడ
పశ్చిమంలోనూ
టీడీపీ
-
జనసేన
పొత్తుతో
కొత్త
చర్చ
మొదలైంది.
పశ్చిమం
నుంచి
జనసేన
అభ్యర్ధిగా
పోతిన
మహేష్
సీటు
ఆశిస్తున్నారు.
అక్కడ
టీడీపీ
నుంచి
తాను
పోటీ
చేస్తానంటూ
తాజాగా
బుద్దా
వెంకన్న
ప్రకటించారు.
ఇప్పటికే
నాగుల్
మీరా
రేసులో
ఉన్నారు.
వైసీపీ
నుంచి
తిరిగి
మాజీ
మంత్రి
వెల్లంపల్లికి
దాదాపు
ఖాయంగా
కనిపిస్తోంది.
జనసేనకు
నుంచి
పోతిన
మహేష్
కు
ఇస్తే
టీడీపీ
నేతలకు
ఎటువంటి
హామీ
ఇస్తారు..
ఏ
విధంగా
సహకరిస్తారనేది
పొలిటికల్
సర్కిల్స్
లో
చర్చకు
కారణమవుతోంది.
విజయవాడ
తూర్పు
నుంచి
టీడీపీ
ఎమ్మెల్యేగా
ఉన్న
గద్దే
రామ్మోహన్
ను
వచ్చే
ఎన్నికల్లో
గన్నవరం
నుంచి
పోటీ
చేయించాలని
భావిస్తున్నారు.
అదే
జరిగితే
తూర్పు
నుంచి
గద్దే
సూచించిన
వారికి
సీటు
ఇస్తారా..
లేక,
కొత్తగా
సర్దుబాట్లు
చేస్తారా
అనేది
చూడాల్సి
ఉంది.